శ్రీరంగరాజపురం:చెరుకు తోట దగ్ధమై రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించిన సంఘటన మండలంలోని కమ్మకండ్రిక పంచాయతీ మిట్ట హరిజనవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మిట్టహరిజనవాడకు చెందిన రైతు నవీన్కు ఐదు ఎకరాల చెరుకు పంటకు మంగళవారం మధ్యాహ్నం ఎవరో గుర్తు తెలి యని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న చెరుకు తోటకు అంటుకోవడంతో ఐదెకరాల చెరుకు తోట, షెడ్డు, మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉన్న బెల్లం దగ్ధం అయింది. అగ్ని ప్రమాదం జరిగిన చెరుకు తోటను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని తహసీల్దార్ లోకనాథపిళ్లై తెలిపారు.


