
● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పర
ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామన్న కూటమి నేతలు అభివృద్ధిని మరిచారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాను సమస్యలు వేధిస్తున్నాయి. స్థానిక సంస్థల ను నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో జనం పాలకా.. ఏమిటీ ఏలిక అని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న 3వ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనైనా వీటిపై దృష్టి సారిస్తారోలేదో చూడాల్సి ఉంది.
నియోజకవర్గాల్లో సమస్యలిలా..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
కుప్పం: నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎక్కువయ్యా యి. శాంతిపురం మండలంలో 15 ఎకరాలు, కుప్పం మండలం పెద్దవంక సరిహద్దులో అటవీ భూములు, ఇదే మండలంలోని బొగ్గుపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు.
తిరుపతి: నియోజకవర్గంలో 8 చెరువులు, 395.71 ఎకరాల్లో 20 శాతం భూములు ఆక్రమణకు గురైనట్లు సమాచారం.
నగరి: నియోజకవర్గంలో రైతులకు విద్యుత్ సరఫరాలో ఎక్కువగా అంతరాయం కలుగుతోంది. నిండ్ర నేటమ్స్ షుగర్స్ మూతపడటంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్రీకాళహస్తి: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సువర్ణముఖి నదీ పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సగటున 800 నుంచి 900 ట్రాక్టర్లు, 150 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.
గంగాధరనెల్లూరు : నియోజకవర్గంలో అధికార పార్టీ భూ కబ్జాలు ఎక్కువయ్యాయి. పేదలందరికీ ఇళ్ల పురోగతికి కూటమి సర్కారు నిధులు ఇవ్వడం లేదు.
పూతలపట్టు : నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
సత్యవేడు : నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు రాకపోకలకు అవస్థ పడుతున్నారు. అలాగే పారిశుద్ధ్యం పడకేసింది.
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పురోగతికి నోచుకోని పక్కా గృహాలు
చిత్తూరు కలెక్టరేట్/కార్పొరేషన్:ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా వాటిని పరిష్కరించడంలో కూటమి సర్కారు అలసత్వం వహిస్తోంది. దీనికితోడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 14 నియోజకవర్గాల్లోని 66 మండలాల్లో గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. అయితే వారికి కూటమి ప్రభుత్వం అధికారాలు లేకుండా నిర్వీర్యం చేసింది. దీంతో అభివృద్ధి కుంటుపడింది.
అద్భుతాలు చేస్తామన్నారు...అభివృద్ధి మరిచారు
మా పాలన వస్తే అద్బుతాలు చేస్తాం.. ప్రతి రంగంలోని సమస్యలను పరిష్కరిస్తామం ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామంటూ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాన్లు చెప్పిన మాటలివి. వారు చెప్పిన మాటలు 11 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కటీ నెరవేరలేదు.
పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.300 కోట్లుకు పైగా పేరుకుపోయాయి. గడిచిన 11 నెలలుగా బకాయిలను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం విడుదల చేయకపోవడంతో ఆరోగ్య సేవలు దూరమయ్యాయి.
కరువు పరిహారం శూన్యం
గతేడాది వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 43,174 హెకార్టులు కాగా, సాగు విస్తీర్ణం 13,044 హెక్టార్లు ఉంది. ఇందులో 9 వేల హెక్టార్లలో పంట నష్టం కలిగింది. ఇందుకు రూ.15.42 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు అందలేదు.
జెడ్పీటీసీ సభ్యుల వేతనాలు లేవ్
జెడ్పీటీసీ సభ్యులకు వేతనాలు మంజూరు చేయడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులే ఉన్నారు. దీంతో కూటమి సర్కారు వారికి వేతనాలను మంజూరు చేయకుండా కుట్రలు చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీ సభ్యులకు దాదాపు రూ.43 లక్షల వరకు జీతాలు చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
ట్రాన్స్కో సేవలు తిరుపతి నుంచే..
జిల్లా విద్యుత్శాఖ కార్యాలయం చిత్తూరులో ఏర్పాటు చేసినా ఇంకా తిరుపతి జిల్లా నుంచే సేవలు అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటై 6 నెలలవుతున్నా తిరుపతి నుంచి ఇంకా 15 మంది ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంది.
కష్టాల ఆస్పత్రి
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి కష్టాల ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడికి చికిత్స కోసం వెళ్లే ప్రజలకు మెరుగైన వైద్యం అందకపోగా ఆరోగ్యం మరింతగా క్షీణించి అనారోగ్యం పాలవుతున్నారు. వందల సంఖ్యలో ఓపీలు వస్తున్నా సేవలు మాత్రం శూన్యం. వైద్యుల పోస్టులు ఖాళీ, ఉన్న సీనియర్ వైద్యులు సమయపాలన లేమితో రోగులు ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే జంకుతున్నారు.
పెండింగ్లో రహదారుల బిల్లులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్లెపండుగ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.84 కోట్లకు పనులు చేపట్టారు. అందులో రూ.26 కోట్లు మాత్రమే ఇచ్చారు, మిగిలిన రూ.61 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. అలాగే ఆర్అండ్బీ పరిధిలో రూ.23 కోట్లతో ప్యాచ్వర్క్లు చేపట్టారు వీటి బిల్లులు సైతం పెండింగ్లో ఉన్నాయి.
23 మండలాల్లో తాగునీటి సమస్య
ప్రస్తుత వేసవిలో చిత్తూరు జిల్లాలోని 23 మండలాల్లో తాగునీటి సమస్యలున్నాయి. జిల్లాలోని 23 మండలాల్లో 923 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది.

● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పర

● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పర

● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పర

● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పర

● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పర