క్రెడాయ్‌ నూతన కార్యవర్గం | V Rajasekhar Reddy becomes the President of Credai | Sakshi
Sakshi News home page

క్రెడాయ్‌ నూతన కార్యవర్గం

Nov 11 2023 5:00 AM | Updated on Nov 11 2023 5:00 AM

V Rajasekhar Reddy becomes the President of Credai - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) హైదరాబాద్‌ చాప్టర్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా వీ రాజశేఖర్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీగా బీ జగన్నాథరావు, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా ఎన్‌ జైదీప్‌రెడ్డి ఎన్నికయ్యా రు.

వైస్‌ ప్రెసిడెంట్లుగా బీ ప్రదీప్‌రెడ్డి, సీజీ మురళీ మోహన్, కొత్తపల్లి రాంబాబు, ఎం శ్రీకాత్‌లు, ట్రెజరర్‌గా మనోజ్‌ కుమార్‌ అగర్వాల్, జాయింట్‌ సెక్రటరీలు జీ నితీష్‌ రెడ్డి, క్రాంతికి రణ్‌రెడ్డిలు ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఏ వెంకట్‌ రెడ్డి, బీ జైపాల్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ బన్సల్, సీ అమరేందర్‌రెడ్డి, సుశీ ష్‌ కుమార్‌ జైన్, మోరిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్, ఎన్‌ వంశీధర్‌రెడ్డిలు వ్యవహరిస్తారు. 2023–25 సంవత్సరాలకు ఈ పదవిలో కొనసాగుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement