8 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్‌ కీలకం.. ఎలాగో తెలుసా.. | UPI And Aadhaar Will Be Key To Indian Economy Reaching 8 Trillion | Sakshi
Sakshi News home page

8 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్‌ కీలకం.. ఎలాగో తెలుసా..

Feb 22 2024 11:26 AM | Updated on Feb 22 2024 11:47 AM

UPI And Aadhaar Will Be Key To Indian Economy Reaching 8 Trillion - Sakshi

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌ఫేస్ (యూపీఐ), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) వల్ల 2030 నాటికి ఇండియా ఆర్థిక  వ్యవస్థ 8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో కీలకంగా పనిచేయనున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

యూపీఐ, డీపీఐల ద్వారానే ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించగలదని నాస్కామ్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలియజేస్తుంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్‌‌తో కలిసి నాస్కామ్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. డీపీఐలు భారతదేశ జనాభాలో 97 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి. మెచ్యూర్డ్ డీపీఐల వల్ల 31.8 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరిగింది. ఇది 2022లో భారతదేశ జీడీపీలో 0.9 శాతానికి సమానం. 

ఇదీ చదవండి: ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్‌ స్టోర్‌..? ప్రత్యేకతలివే..

డైరెక్ట్​ బెనిఫిట్స్​ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో ఆధార్‌ను పరిచయం చేయడం ద్వారా దాదాపు 15.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. యూపీఐ వల్ల నగదు లావాదేవీలు, పేపర్​ వాడకం  తగ్గింది. దాంతో కాలుష్యమూ తగ్గినట్లు నివేదికలో తేలింది. పేపర్‌వాడకం తగ్గడం వల్ల లాజిస్టిక్స్, రవాణా రంగంలో 2022లో 3.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement