ఉద్యోగులకు డీఏ పెంపు? | Union Cabinet expected to approve DA hike today | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు డీఏ పెంపు?

Oct 1 2025 1:56 PM | Updated on Oct 1 2025 3:31 PM

Union Cabinet expected to approve DA hike today

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఈ రోజు జరుగుతున్న సమావేశంలో పరిశీలించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సవరించిన డీఏ ఆమోదం పొందితే జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నారు.

కరువు భత్యం(డీఏ) అనేది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల గృహ ఖర్చులపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూడ్చడానికి చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కేబినెట్ దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్ణయం వెలువడితే ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బంది ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుంది.

పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) డేటా ఆధారంగా సిఫార్సులకు అనుగుణంగా ఈ పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. సంవత్సరానికి రెండుసార్లు డీఏ సవరణలను లెక్కిస్తారు. పెరుగుతున్న ధరలను నిర్వహించడానికి ఉద్యోగులకు సహాయపడటానికి డీఏను సాధారణంగా ఏటా జనవరి, జులైలో సవరిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం మార్చిలో మూల వేతనం, పింఛన్లలో డీఏ 2% పెంపునకు ఆమోదం తెలిపింది. దీన్ని 53% నుంచి 55%కి పెంచింది. ఉదాహరణకు రూ.50,000 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగికి చివరి పెంపు తర్వాత రూ.26,500 డీఏ చెల్లిస్తున్నారు.

ఇదీ చదవండి: సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేలా ఆర్‌బీఐ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement