ఆ ఆప్షన్‌ తొలగింపు..ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం | Twitter Will No Longer Tweet Was Sent Out From An Iphone Or An Android | Sakshi
Sakshi News home page

ఆ ఆప్షన్‌ తొలగింపు..ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం

Dec 18 2022 7:43 PM | Updated on Dec 18 2022 8:57 PM

Twitter Will No Longer Tweet Was Sent Out From An Iphone Or An Android  - Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విటర్‌లో ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల నుంచి ట్వీట్‌ చేస్తే .. సదరు ట్వీట్‌ ఏ ఫోన్‌ నుంచి ట్వీట్‌ చేశారో గుర్తించలేమని మస్క్‌ తెలిపారు. 

నెటిజన్‌ చేసిన ఓ ట్వీట్‌కు మస్క్‌ స్పందించారు. ఏ మొబైల్‌  డివైజ్‌ నుంచి ట్వీట్‌ చేశారో ఇకపై గుర్తించలేమని వెల్లడించారు. బిలియనీర్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి సంస్థలో  తీసుకొచ్చిన మరో అప్‌డేట్‌ అని పలు నివేదికలు చెబుతున్నాయి.   

మస్క్ గత నెలలో ఏ డివైజ్‌ నుంచి ట్వీట్‌ చేసిందో తెలిపే ఆప్షన్‌ను డిజేబుల్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫంక్షన్‌ స్క్రీన్ స్పేస్ & కంప్యూటర్ కు వృధా అని పేర్కొన్నారు. ప్రతి ట్వీట్ క్రింద ఏ పరికరంలో ట్వీట్ చేశారో తెలిపే ఆప్షన్‌ను డిలీట్‌ చేస్తున్నాం.మేం ఎందుకు అలా చేశామో కూడా ఎవరికీ తెలియదన‍్నారు. కాగా,ఈ మార్పు కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ట్విటర్‌ బ్లూను విడుదల చేసిన వెంటనే వస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement