
హైదరాబాద్: టాటా గ్రూప్లో భాగమైన సంప్రదాయ దుస్తుల బ్రాండ్ తనైరా హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించింది. నగరంలో తమ నాలుగో స్టోర్ను ఏర్పాటు చేసింది. సుమారు 4,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన స్టోర్ను సంస్థ రిటైల్ హెడ్ అనిర్బన్ బెనర్జీ, సౌత్ రీజనల్ బిజినెస్ హెడ్ శరద్ ఆర్ దీన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జూన్ 16 నుంచి 20 వరకు ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఆఫర్ ప్రకటించారు. రూ. 20,000 విలువైన కొనుగోళ్లు చేసే కస్టమర్లకు 0.2 గ్రాముల తనిష్క్ బంగారం నాణెం అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.