
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 40 పాయింట్లు తగ్గి 24,781కు చేరింది. సెన్సెక్స్(Sensex) 152 ప్లాయింట్లు పడిపోయి 81,388 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 2.05 శాతం లాభపడింది. నాస్డాక్ 2.47 శాతం ఎగబాకింది.
ఇదీ చదవండి: టర్కీ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేసిన చెన్నై ఎయిర్పోర్ట్
ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్ స్ట్రీట్ ఇటీవల మార్కెట్ సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కేంద్రానికి ఆర్బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చేవిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)