దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ ఆధిక్యంలో ఉండటంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ మ్యూట్ ఓపెన్ తర్వాత పెరిగాయి. ఈరోజు ఉదయం 9:35 గంటల సమయానికి నిఫ్టీ 0.19 శాతం లేదా 46.20 పాయింట్లు పెరిగి 23,870.30 వద్ద, సెన్సెక్స్ 230.96 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,431.64 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 50 ఇండెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.03 శాతం నష్టపోయాయి.
రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ 1 శాతం పెరిగి ఇతర రంగాల సూచీలలో లీడ్ లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆటో తక్కువ పనితీరు కనబరిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


