దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ సెషన్ ను 357.77 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 77,160.67 వద్ద ప్రారంభించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.50 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,106.60 వద్ద ప్రారంభమైంది.
నిఫ్టీ 50లో సిప్లా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.58 శాతం పెరిగాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


