25,000 మార్కు దాటిన నిఫ్టీ..! | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

25,000 మార్కు దాటిన నిఫ్టీ..!

Aug 1 2024 9:38 AM | Updated on Aug 1 2024 10:03 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 25,053కు చేరింది. సెన్సెక్స్‌ 266 పాయింట్లు పుంజుకుని 82,006 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే సంకేతాలు స్పష్టమవడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 80.72 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.58 శాతం, నాస్‌డాక్‌ 2.64 శాతం  లాభపడ్డాయి.

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరొమ్‌ పావెల్‌ సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్‌ మీటింగ్‌లో వడ్డీరేట్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే దానికి ద్రవ్యోల్బణాన్ని మరింత పరిశీలించాలని తెలిపారు. దాంతో యూఎస్‌ మార్కెట్‌లు రానున్న సెషన్‌లో ఎలాగైనా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే ఉద్దేశంతో భారీగా పెరిగాయి. దేశీయంగా జులై నెలకు సంబంధించి ఆగస్టు 1న వెలువడే ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement