సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Mar 18 2024 9:16 AM | Updated on Mar 18 2024 9:46 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 21,970కు చేరింది. సెన్సెక్స్‌ 154 పాయింట్లు దిగజారి 72,480 వద్ద ట్రేడవుతోంది.

క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 85.33 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్‌ అండ్‌ పీ 0.65 శాతం, నాస్‌డాక్‌ 1 శాతం నష్టపోయాయి.

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్‌ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(మార్చి 19), బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement