సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 23 2024 3:27 PM | Updated on Apr 23 2024 3:33 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 22,368 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 89 పాయింట్లు ఎగబాకి 73,738 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, టైటాన్‌, పవర్‌గ్రిండ్‌, ఇన్ఫోసిస్‌ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

సన్‌ఫార్మా, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement