సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌ సూచీలపై బేర్‌ పంజా | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: మార్కెట్‌ సూచీలపై బేర్‌ పంజా

Mar 19 2024 3:34 PM | Updated on Mar 19 2024 3:34 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 21,813 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 736 పాయింట్లు దిగజారి 72,012 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ముగించాయి.

టీసీఎస్‌, నెస్లే, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, హిందూస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనుంది. దాంతో గురువారం మార్కెట్‌లు స్పందించనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement