ప్రతికూలంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. | Stock Market Highlights Mar 28th 2025 Sensex Nifty ends with | Sakshi
Sakshi News home page

ప్రతికూలంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఈ ఏడాదికిక సెలవు!

Published Fri, Mar 28 2025 3:54 PM | Last Updated on Fri, Mar 28 2025 4:12 PM

Stock Market Highlights  Mar 28th 2025 Sensex Nifty ends with

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY25) చివరి ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ప్రతికూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 191.51 పాయింట్లు లేదా 0.25 శాతం క్షీణించి 77,414.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 72.60 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 23,519.35 వద్ద ముగిసింది.

విస్తృత మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.32 శాతం, 0.15 శాతం నష్టాలతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 50 ఆర్థిక సంవత్సరం దాదాపు 5 శాతం చొప్పున లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 5.4 శాతం, 7.48 శాతం లాభాలను నమోదు చేశాయి. 
శుక్రవారం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకులు, ఎంపిక చేసిన హెల్త్‌కేర్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఎన్ఎస్ఈలో నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.76 శాతం నష్టపోగా, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్లలో అస్థిరతను కొలిచే ఫియర్ ఇండెక్స్ ఇండియా వీఐఎక్స్ శుక్రవారం 4.37 శాతం పెరిగి 12.72 పాయింట్ల వద్ద స్థిరపడింది. రేపటి నుంచి వరుసగా మూడు స్టాక్‌మార్కెట్లు మూత పడనున్నాయి. శని, ఆదివారాలు వారంతపు సెలవులు కాగా మార్చి 31న సోమవారం రంజాన్‌ పండుగ కారణంగా సెలవు ఉంది. దీంతో 2025 ఏప్రిల్ 1 అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో తిరిగి భారత మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement