దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలలో ముగిశాయి. పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు 100 డాలర్లను తాకడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు ప్రభావితమయ్యాయి. మూడవ రోజు కూడా క్షీణించాయి. సెన్సెక్స్ 813.35 పాయింట్లు లేదా 1.08 శాతం క్షీణించి 74,764.23 వద్ద, నిఫ్టీ 203.60 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 23,431.50 వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా స్టాక్లు నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.51 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.48 శాతం తగ్గాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించి 3 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ కూడా తక్కువ పనితీరు కనబరిచింది. నిఫ్టీ మెటల్ మాత్రం అవుట్ పెర్ఫార్మ్ చేసింది.


