టాప్‌-100 కంపెనీలకు డిజిటల్‌ అష్యూరెన్స్‌: సెబీ | SEBI Proposes Mandatory Digital Assurance Reporting for Companies | Sakshi
Sakshi News home page

టాప్‌-100 కంపెనీలకు డిజిటల్‌ అష్యూరెన్స్‌: సెబీ

Feb 6 2025 8:04 AM | Updated on Feb 6 2025 9:13 AM

SEBI Proposes Mandatory Digital Assurance Reporting for Companies

టాప్‌-100 లిస్టెడ్‌ కంపెనీలకు ఆర్థిక నివేదికలకు సంబంధించి తప్పనిసరి డిజిటల్‌ అష్యూరెన్స్‌ను సెబీ ప్రతిపాదించింది. కంపెనీల ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లు, ఆయా కంపెనీల డిజిటల్‌ సమాచార మూలాలను కూడా ధ్రువీకరించనుండడం ఇందులో భాగంగా ఉంటుంది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని సెబీ (SEBI) విడుదల చేసింది.

‘‘డిజిటల్‌ అష్యూరెన్స్‌ రిపోర్ట్‌తో పారదర్శకత పెరుగుతుంది. సమాచార వెల్లడి ప్రమాణాలు మెరుగుపడతాయి. తద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు మరింత రక్షణ లభించి, వ్యవస్థ పట్ల నమ్మకం పెరుగుతుంది’’అని సెబీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లే ఈ డిజిటల్‌ అష్యూరెన్స్‌ నివేదికలను ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది.

దీనికి సహకారం అందించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) కూడా ముందుకు వచ్చింది. డిజిటల్‌గా అందుబాటులో ఉన్న ఆడిట్ ఆధారాలు, సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా ఆడిట్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి 
తమ సభ్యులకు మార్గదర్శకత్వం అందించడానికి డిజిటల్ హామీపై  ఒక మార్గదర్శనాన్ని విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement