రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ | SEBI approved the IPO of Kalpataru, Unimech Aerospace plans to raise funds | Sakshi
Sakshi News home page

రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Nov 26 2024 9:14 AM | Updated on Nov 26 2024 9:14 AM

SEBI approved the IPO of Kalpataru, Unimech Aerospace plans to raise funds

రియల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్‌తోపాటు, హైప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ యూనిమెక్‌ ఏరోస్పేస్‌ అండ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోలో కల్పతరు పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. యూనిమెక్‌ ఏరోస్పేస్‌ తాజాగా ఈక్విటీ జారీసహా ప్రమోటర్లు షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.

రూ.1,590 కోట్లపై దృష్టి

కల్పతరు కంపెనీ ప్రాస్పెక్టస్‌ ప్రకారం సంస్థ ఐపీవోలో భాగంగా రూ.1,590 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో దాదాపు రూ.1,193 కోట్లు కల్పతరు గ్రూప్‌ కంపెనీ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కల్పతరు గ్రూప్‌లో కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్, ప్రాపర్టీ సొల్యూషన్స్‌(ఇండియా), శ్రీ శుభం లాజిస్టిక్స్‌ ఉన్నాయి.

ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..

రూ.500 కోట్ల సమీకరణ

ఐపీవోలో భాగంగా యూనిమెక్‌ ఏరోస్పేస్‌ రూ.250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర మెషీనరీ, పరికరాల కొనుగోలు ద్వారా విస్తరణకు వినియోగించనుంది. ఈ బాటలో వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, రుణ చెల్లింపులు తదితరాలకు సైతం 
నిధులను వెచ్చించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement