Prestige Estates Projects Targeting To Sell Properties Worth At Least Rs 12,000 Crore This Fiscal - Sakshi
Sakshi News home page

ఇదే టార్గెట్‌.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!

Aug 15 2022 3:20 PM | Updated on Aug 15 2022 4:19 PM

Real Estate Firm Prestige Estates Plans To Sell 12000 Crore Properties - Sakshi

న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. వెరసి అమ్మకాల్లో 16 శాతం వృద్ధిని ఆశిస్తోంది. దక్షిణాదిన పటిష్ట కార్యకలాపాలు కలిగిన కంపెనీ ఇటీవల ముంబై మార్కెట్లో ప్రవేశించింది. గతేడాది(2021–22) అమ్మకాల బుకింగ్స్‌ 90 శాతం పుంజుకున్నాయి.

కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,382 కోట్లను అధిగమించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలో కనీసం రూ. 12,000 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్‌ రజాక్‌ పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ వృద్ధినే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే వివిధ ప్రాజెక్టులను ఎంత త్వరగా అనుమతులు లభించేదీ అన్న అంశం ఆధారంగా లక్ష్యాలను చేరుకోగలమని వివరించారు.

చదవండి: టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్‌ మస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement