ఓఎన్‌జీసీ రూ. లక్ష కోట్లు | ONGC Plans To Invest Rs 1 Lakh Crore To Set Up Two Petrochemical Plants, Details Inside - Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ రూ. లక్ష కోట్లు

Nov 16 2023 4:46 AM | Updated on Nov 16 2023 12:19 PM

ONGC plans to invest Rs1 lakh crore to set up two petrochemical plants - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) రెండు పెట్రోకెమికల్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్‌ కాల్‌ సందర్భంగా ఓఎన్‌జీసీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ పోమిలా జస్పాల్‌  వెల్లడించారు.

వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్‌ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్‌ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్‌ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement