మెట్రోలు, హిల్‌ స్టేషన్లకే మొగ్గు | Metro cities, Manali, Dubai among top choices for Indian travellers in H1 | Sakshi
Sakshi News home page

మెట్రోలు, హిల్‌ స్టేషన్లకే మొగ్గు

Jul 15 2023 6:01 AM | Updated on Jul 15 2023 6:01 AM

Metro cities, Manali, Dubai among top choices for Indian travellers in H1 - Sakshi

ముంబై: దేశీయంగా మెట్రో నగరాలు, హిల్‌స్టేషన్లతో కూడిన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలలపై ట్రావెల్‌ బుకింగ్‌ సేవలు అందించే ‘బుకింగ్‌ డాట్‌ కామ్‌’ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, మనాలీ, రిషికేశ్, వారసత్వ సంపదకు నిలయమైన జైపూర్‌ తదితర ప్రాంతాలను ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా చూస్తే, దుబాయి, బ్యాంకాక్, లండన్, సింగపూర్, కౌలాలంపూర్, హోచిమిన్హ్, ప్యారిస్, హనోయ్‌ ప్రాంతాలను సందర్శించేందుకు భారత పర్యాటకులు ఎక్కువ మంది బుకింగ్‌ చేసుకున్నారు. హోటళ్లకు అదనంగా, రిసార్ట్‌లు, గెస్ట్‌ హౌస్‌లు, ఆతిథ్య గృహాలు పర్యాటకుల ప్రాధాన్యంగా ఉన్నాయి.  

ఈ దేశాల నుంచి ఎక్కువగా..
మొదటి ఆరు నెలల్లో యూఎస్, బంగ్లాదేశ్, రష్యా, యూఏఈని నుంచి ఎక్కువ మంది భారత్‌ను సందర్శించారు. అలాగే, విదేశీ పర్యాటకులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు మెట్రోలను ఎక్కువగా చూశారు.  86 శాతం భారత పర్యాటకులు వచ్చే 12 నెలల్లో తమ పర్యటనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘‘స్థూల ఆర్థిక సమస్యలను పర్యాటక రంగం ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. హోటళ్లే కాకుండా పర్యాటకులు ప్రత్యామ్నాయ ఆతిథ్యాలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు’’అని బుకింగ్‌ డాట్‌ కామ్‌ కంట్రీ మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement