ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫాం మేక్మైట్రిప్ ఇండియా (ఎంఎంటీ ఇండియా) పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సమర్పించింది.
దీని ప్రకారం.. కంపెనీ మాతృ సంస్థ మేక్మైట్రిప్, దాని అనుబంధ సంస్థ ఐబిబో గ్రూప్ హోల్డింగ్స్ కొంత వాటాలను విక్రయించనున్నాయి. తద్వారా వచ్చిన నిధులు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడనున్నాయి. ఐపీవో అనంతరం కూడా మేక్మైట్రిప్కి ఎంఎంటీ ఇండియా అనుబంధ సంస్థగానే కొనసాగుతుంది.


