పరిశ్రమ వర్గాల వ్యతిరేకత.. స్థిరంగా ప్రభుత్వం | India E Waste Policy Sparks Controversy | Sakshi
Sakshi News home page

పరిశ్రమ వర్గాల వ్యతిరేకత.. స్థిరంగా ప్రభుత్వం

Apr 13 2025 9:51 AM | Updated on Apr 13 2025 10:31 AM

India E Waste Policy Sparks Controversy

భారతదేశం ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను(ఈ-వేస్ట్‌) సరైన విధంగా నిర్వహించాలని తీసుకొచ్చిన ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్‌ పాలసీని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మెరుగైన పర్యావరణం కోసం ఈ పాలసీని ప్రవేశపెట్టినా కంపెనీల ప్రతికూలతతో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల కంపెనీల ఆదాయాలు ప్రభావితం చెందుతున్నాయని సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. కాగా, డైకిన్, హిటాచీ, శామ్‌సంగ్‌ వంటి దిగ్గజ కంపెనీలు సహా ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఈ పాలసీలోని అంశాలను వ్యతిరేకిస్తున్నాయి.

ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను లక్ష్యంగా చేసుకుని ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఈ విధానం కఠినమైన ఆదేశాలను ప్రవేశపెట్టింది. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ​్‌ను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన విధానాల కోసం కంపెనీలు అధిక మొత్తంలో వెచ్చించాల్సి రావడమే దీని వ్యతిరేకతకు కారణం. కొన్ని సందర్భాల్లో రీసైక్లింగ్‌ ఖర్చులు మూడింతలు అవుతుండడంతో ఆయా కంపెనీల ఆదాయాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మెరుగైన ఈ-వేస్ట్‌ నిర్వహణే లక్ష్యంగా

ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. పట్టణీకరణ వేగంగా విస్తరించడం, సాంకేతికత పెరుగుతుండడంతో ఈ-వేస్ట్‌ కూడా అందుకు అనుగుణంగానే అధికమవుతుంది. దాంతో పర్యావరణ పరిణామాలను పరిష్కరించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ-వేస్ట్‌ నిర్వహణ కోసం అధిక రీసైక్లింగ్ ఫీజులను అమలు చేయడం ద్వారా బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అనవసరమైన ఆర్థిక ఒత్తిడి

ఈ విధానంపై ఎలక్ట్రానిక్స్ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన ఖర్చులు వ్యాపారాలపై అనవసరమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయని చెబుతున్నాయి. దీనికితోడు ఈ పాలసీలోని నిబంధనల అమలు కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుపుతున్నాయి. ఇది వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొన్ని కంపెనీలు న్యాయపరమైన సవాళ్లను కూడా దాఖలు చేశాయి. ఈ ఆకస్మిక మార్పులు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తాయని తెలిపాయి. అధిక పోటీ మార్కెట్లో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయని భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్‌ ఆఫర్‌

పాలసీ ప్రతిపాదకుల వాదన ఇదే..

ఈ పాలసీపై కంపెనీల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పులు లేవు. పెరుగుతున్న ఈ-వ్యర్థాల సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం నొక్కి చెప్పింది. స్వల్పకాలిక ఆర్థిక భారాల కంటే దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఈ విధానం ప్రతిపాదకులు తెలుపుతున్నారు. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం వల్ల ఉద్యోగాలు సృష్టించబడతాయని చెబుతున్నారు. కార్మికుల భద్రత మెరుగుపడుతుందని, హానికర పదార్థాలను సరిగ్గా నిర్వహించేలా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement