E-Waste Management
-
పరిశ్రమ వర్గాల వ్యతిరేకత.. స్థిరంగా ప్రభుత్వం
భారతదేశం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్) సరైన విధంగా నిర్వహించాలని తీసుకొచ్చిన ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మెరుగైన పర్యావరణం కోసం ఈ పాలసీని ప్రవేశపెట్టినా కంపెనీల ప్రతికూలతతో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల కంపెనీల ఆదాయాలు ప్రభావితం చెందుతున్నాయని సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. కాగా, డైకిన్, హిటాచీ, శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు సహా ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఈ పాలసీలోని అంశాలను వ్యతిరేకిస్తున్నాయి.ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను లక్ష్యంగా చేసుకుని ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఈ విధానం కఠినమైన ఆదేశాలను ప్రవేశపెట్టింది. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన విధానాల కోసం కంపెనీలు అధిక మొత్తంలో వెచ్చించాల్సి రావడమే దీని వ్యతిరేకతకు కారణం. కొన్ని సందర్భాల్లో రీసైక్లింగ్ ఖర్చులు మూడింతలు అవుతుండడంతో ఆయా కంపెనీల ఆదాయాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.మెరుగైన ఈ-వేస్ట్ నిర్వహణే లక్ష్యంగాప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. పట్టణీకరణ వేగంగా విస్తరించడం, సాంకేతికత పెరుగుతుండడంతో ఈ-వేస్ట్ కూడా అందుకు అనుగుణంగానే అధికమవుతుంది. దాంతో పర్యావరణ పరిణామాలను పరిష్కరించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ-వేస్ట్ నిర్వహణ కోసం అధిక రీసైక్లింగ్ ఫీజులను అమలు చేయడం ద్వారా బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.అనవసరమైన ఆర్థిక ఒత్తిడిఈ విధానంపై ఎలక్ట్రానిక్స్ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన ఖర్చులు వ్యాపారాలపై అనవసరమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయని చెబుతున్నాయి. దీనికితోడు ఈ పాలసీలోని నిబంధనల అమలు కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుపుతున్నాయి. ఇది వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొన్ని కంపెనీలు న్యాయపరమైన సవాళ్లను కూడా దాఖలు చేశాయి. ఈ ఆకస్మిక మార్పులు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తాయని తెలిపాయి. అధిక పోటీ మార్కెట్లో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయని భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్పాలసీ ప్రతిపాదకుల వాదన ఇదే..ఈ పాలసీపై కంపెనీల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పులు లేవు. పెరుగుతున్న ఈ-వ్యర్థాల సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం నొక్కి చెప్పింది. స్వల్పకాలిక ఆర్థిక భారాల కంటే దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఈ విధానం ప్రతిపాదకులు తెలుపుతున్నారు. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం వల్ల ఉద్యోగాలు సృష్టించబడతాయని చెబుతున్నారు. కార్మికుల భద్రత మెరుగుపడుతుందని, హానికర పదార్థాలను సరిగ్గా నిర్వహించేలా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు. -
ఏడాదిన్నరలో కేన్సర్ ఆస్పత్రి సేవలు
- ఈ-వేస్ట్ మేనేజ్మెంట్, కాలుష్య నియంత్రణలపై అధ్యయనం - పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ వెల్లడి సాక్షి,విశాఖపట్నం: పెరుగుతున్న ఈ వేస్ట్మేనేజ్మెంట్, కాలుష్యనివారణ, వ్యర్ధాల శుద్ధిపై క్షేత్ర స్థాయిలో మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని సబార్డినేట్ లెజిస్లేషన్ పార్లమెంటరీ కమిటీ(రాజ్యసభ) చైర్మన్ డాక్టర్ సుబ్బిరామిరెడ్డి అన్నారు. పారిశ్రామిక,పోర్టు ఆధారిత నగరాల్లో రోజురోజకు పెరుగుతున్న కాలుష్యం, ఈ వేస్ట్ల నియంత్రణకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు నష్టం చేకూర్చిన వారమవుతామన్నారు. ఇందుకోసం రాజ్యసభలో చేసినచట్టాల అమ లు కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. శనివారం కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ సుబ్బిరామిరెడ్డి స్థానిక నోవటల్లో మీడియాతో మాట్లాడారు. విశాఖలో రూ.400 కోట్లతో అణు ఇంధనసంస ్థద్వారా నిర్మిస్తున్న హూమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఏడాదిన్నరలో అందుబాటులోకి రానుందన్నారు. పోర్టు, పారి శ్రామిక కాలుష్యంతో సతమత మవుతున్న విశాఖను గ్రీన్సిటీగా తీర్చిదిద్దేం దుకు రెండేళ్లలో 40లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా,ఇప్పటికే నగరంలో 14లక్షలమొక్కలు నాటారని అధికారులు చెబుతున్నారని చెప్పారు.మిగిలిన 26 లక్షలు మొక్కలు 2017కల్లా నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించామన్నారు. పోస్టులు భర్తీ చేయాలి.. కింజ్జార్జి ఆస్పత్రి స్థాయికి తగ్గట్టుగా సిబ్బందిలేదని, వెయ్యి మంది నర్సులు అవసరమైతే ప్రస్తుతం 250 మంది నర్సులు మాత్రమే ఉన్నారన్నారు. రాష్ర్ట ప్రభుత్వం సత్వరమే ఈ పోస్టులను భర్తీ చేసి ఈ ఆస్పత్రిలోని వైద్య సదుపాయాలను మరింత మెరుగు పర్చాలన్నారు. కేజీహెచ్లో రూ.75కోట్ల సీఎస్ఆర్ నిధులతో కొత్త బ్లాకుల నిర్మాణ పనులు రెండు నెలల్లో మొదలవుతాయని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం కమిటీకి తెలిపారని, ఈ నిధులకు త్వరలో జఫాన్ నుంచి రాష్ట్రానికి మం జూరయ్యేనిధుల్లో రూ.300కోట్లు జతచేసి ఆస్పత్రిని సమగ్రాభివృద్ధి చేయాలని సూచించామన్నారు. విశాఖ రైల్వేస్టేషన్లో పారిశుద్య నిర్వహణ పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తంచేసిందని,నాలుగుప్లాట్ఫారాల్లో నాలుగు ఎలివేటర్లు ఉన్నా యని, రెండు అదనంగా ఏర్పాటు చేస్తామని డీఆర్ఎం చంద్రశేఖ ముఖర్జి, తెలిపారని చైర్మన్ వివరించారు. తొలుత కమిటీ శనివారం కేజీహెచ్తో పాటు విశాఖ రైల్వేస్టేషన్ను పరిశీలించి రోగులు, ప్రయాణికులకు అందుతున్న సేవలను అడిగి తెలుసు కున్నారు. పర్యటనంతరం కమిటీ ఢిల్లీ పయనమైంది. పర్యటనలో కమిటీ సభ్యులు అవింద కుమార్సింగ్, డాక్టర్ కే రామలింగం, శంకరభాయ్, ఎన్.వెగాద్లతో పాటు పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.