
శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలనే లక్ష్యంతో ఎంజీఎం విశ్వవిద్యాలయంలోని జవహర్లాల్ నెహ్రూ ఇంజినీరింగ్ కాలేజ్ (జేఎన్ఈసీ)లో కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి కనక్ తల్వేర్ రూపొందించిన గ్రీన్ ఎనర్జీ వ్యవస్థకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించింది. చెరకు రసం నుంచి బయోఇథనాల్ ఉత్పత్తి చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు.
ఎంజీఎం విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ రవీంద్ర గైక్వాడ్, ఆకాశ్ వాణి, ప్రవర రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డాక్టర్ అన్నాసాహెబ్ వరడే, రవీంద్ర నిబ్లతో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కనక్ కలిసి పనిచేశారు. మొత్తం ఈ ఐదుగురు పరిశోధకులు కలిసి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందినట్లు తెలిపారు.
వ్యవసాయ వ్యర్థాల నుంచి క్లీన్ ఎనర్జీ
బయోఇథనాల్ను తయారు చేయడానికి విస్తృతంగా లభించే చెరకు రసాన్ని ఉపయోగించడం వల్ల ఈ ఆవిష్కరణ ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రక్రియ జీవ ఇంధన ఉత్పత్తి కోసం, ముఖ్యంగా చెరకు పండిస్తున్న వ్యవసాయ ప్రాంతాల్లో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గడం, గ్రామీణ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చెరకు రసంతో పాటు రసం వెలికితీత తర్వాత మిగిలిపోయిన ఫైబరస్ అవశేషమైన బగాస్సేపై పరిశోధనలు చేసి ఈ ప్రక్రియను రూపొందించారు. అంటే పంటలోని ప్రతి భాగాన్ని వినియోగంలోకి తేనున్నారు.
ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..
ఈ ప్రక్రియ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందండంతో ఎంజీఎం విశ్వవిద్యాలయం అకడమిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుకుంది. భారతదేశం గ్రీన్ ఎనర్జీ మిషన్కు అనుగుణంగా విద్యార్థుల నేతృత్వంలోని ఆవిష్కరణలను ఇది హైలైట్ చేసింది. దేశం ప్రతిష్టాత్మక ఇథనాల్ మిశ్రమ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నప్పుడు ఇంధన ఆర్థిక వ్యవస్థలను సృష్టించడంలో ఇలాంటి పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.