జేఏఎల్‌ దివాలా పరిష్కార  ప్రణాళికకు డెడ్‌లైన్‌ పొడిగింపు | CoC extends Jaiprakash Associates resolution plan deadline to 24 June 2025 | Sakshi
Sakshi News home page

జేఏఎల్‌ దివాలా పరిష్కార  ప్రణాళికకు డెడ్‌లైన్‌ పొడిగింపు

Jun 14 2025 4:58 AM | Updated on Jun 14 2025 7:45 AM

CoC extends Jaiprakash Associates resolution plan deadline to 24 June 2025

న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న జైప్రకాష్‌ అసోసియేట్స్‌ (జేఏఎల్‌) పరిష్కార ప్రణాళిక దాఖలుకు ఆఖరు తేదీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జూన్‌ 24కి పొడిగించాయి. బిడ్డర్ల విజ్ఞప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆఖరు తేదీ పొడిగింపును రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించినట్లు జేఏఎల్‌ తెలిపింది. 

వాస్తవానికి ఈ గడువు జూన్‌ 9తో ముగియాలి. అయితే, పలువురు బిడ్డర్లు పరిష్కార ప్రణాళికను సమరి్పంచేందుకు మరింత గడువు కావాలని కోరడంతో సీవోసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. సుమారు 25 కంపెనీలు జేఏఎల్‌ను దక్కించుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, వేదాంత, పతంజలి ఆయుర్వేద, జీఎంఆర్‌ బిజినెస్‌ అండ్‌ కన్సల్టెన్సీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.

 రియల్‌ ఎస్టేట్, సిమెంట్‌ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో జేఏఎల్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌ కావడంతో 2024 జూన్‌ 3న కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) విచారణ చేపట్టింది. కంపెనీకి మొత్తం రూ. 57,185 కోట్ల మేర రుణభారం ఉంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement