ఆధార్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు! | Aadhaar will be able to update key demographic details in online | Sakshi
Sakshi News home page

ఆధార్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!

Jun 24 2025 3:55 PM | Updated on Jun 24 2025 4:10 PM

Aadhaar will be able to update key demographic details in online

ఆధార్‌ కార్డులో అప్‌డేట్స్‌ చేయాలంటే ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది. ఆధార్‌ కార్డులో చిరునామా మార్చాలన్నా, మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయాలన్నా, పేరు, పుట్టిన తేదీ.. వంటివాటిలో మార్పులు చేయాలన్నా ఇకపై ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వీసులు అప్‌డేట్‌ చేస్తున్నారు. నేరుగా ఆన్‌లైన్‌లోనే నవంబర్‌ 2025 నుంచి సవరణ సదుపాయాన్ని కల్పించేలా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది.

ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం వల్ల భౌతిక పత్రాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఆయా కేంద్రాలను సందర్శించే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అప్‌డేషన్‌ ‍ప్రక్రియ ఆన్‌లైన్‌ సేవల ద్వారా వేగవంతం అవుతుంది. ఈ సర్వీసుల ద్వారా సురక్షితంగా, సులభంగా కొత్త ఆధార్‌ను పొందే వీలుంటుంది. దేశంలోని కొన్ని లక్షల మందికి ఈ సర్వీస్‌ ఉపయోగకరంగా మారుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?

దరఖాస్తు సమయంలో పాన్, పాస్‌పోర్ట్‌, రేషన్ కార్డు వంటి ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్‌లో ఉన్న వివరాల ద్వారా యూఐడీఏఐ మీ వివరాలను తనిఖీ చేస్తుంది. పత్రాలను పదేపదే అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నియంత్రిస్తుంది. విద్యుత్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులను కూడా మీ చిరునామాను ధ్రువీకరించడానికి ఉపయోగించవచ్చు. నవీకరణ ప్రక్రియను ఈ చర్యలు గణనీయంగా క్రమబద్ధీకరిస్తాయి.

కొత్త మొబైల్‌ అప్లికేషన్‌..

క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఆధార్‌తో కూడిన కొత్త మొబైల్ అప్లికేషన్‌ను యూఐడీఏఐ త్వరలో విడుదల చేయనుందని చెప్పింది. ఈ అప్‌డేట్‌తో ఇకపై మీ ఆధార్ కార్డు ఫిజికల్ ఫొటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వినియోగదారులు అవసరమైనప్పుడల్లా సురక్షితమైన డిజిటల్ లేదా మాస్క్ ఆధార్‌ను చూపించవచ్చు. మోసాలను అరికట్టడం, నకిలీ ఆధార్ కార్డుల చలామణిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement