కుటుంబానికే ఓటు! | 78 pc employees in India aim for prioritising family | Sakshi
Sakshi News home page

కుటుంబానికే ఓటు!

Jan 30 2025 6:19 AM | Updated on Jan 30 2025 7:54 AM

78 pc employees in India aim for prioritising family

78 శాతం ఉద్యోగుల మనోగతమిదే 

ఇండీడ్‌ తాజా నివేదికలో వెల్లడి

ముంబై: వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చలు.. వారంలో 90 గంటలు పని చేయాలన్న ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలు దానిపై సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన నిరసనలు, జోకులు, కామెంట్లు, వాదనలు  తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 

సర్వేలో పాలుపంచుకున్న 78 శాతం మంది ఉద్యోగులు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండీడ్‌ ఫ్యూచర్‌ కెరీర్‌ రిజల్యూషన్‌ రిపోర్ట్‌ ప్రకారం.. భారతీయ ఉద్యోగుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు వచి్చంది. దాదాపు ఐదుగురిలో నలుగురు (78 శాతం) 2025లో కెరీర్‌లో పురోగతి కంటే జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో గడిపేందుకే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులు తక్కువ ఒత్తిడిని కోరుకుంటున్నారు. మానసిక ప్రశాంతతపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యత కావాలంటున్నారు.  

జాబ్‌ మార్కెట్‌పై సానుకూలం.. 
భారతీయ ఉద్యోగులు జాబ్‌ మార్కెట్‌ గురించి ఆశాజనకంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న రంగాలు, పరిశ్రమలలో అవకాశాల విస్తరణపై 55 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.  ఉద్యోగులు విభిన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చురుకుగా పని చేస్తున్నారు. ఇందుకు అనువుగా తమనితాము మలుచుకుంటున్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

 ఏ ప్రాంతానికైనా వెళ్లి పనిచేసేందుకూ రెడీ అంటున్నారు. ఎక్కువ సంపాదించడం ముఖ్యం అయినప్పటికీ.. సురక్షిత ఉద్యోగం, న్యాయమైన వేతనం, ప్రత్యేకతను చూపే ప్రయోజనాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నారని ఇండీడ్‌ ఆ్రస్టేలియా, ఇండియా, సింగపూర్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రేచల్‌ టౌన్‌స్లీ తెలిపారు. 2024 డిసెంబర్‌–2025 జనవరి మధ్య చేపట్టిన ఈ సర్వేలో ఉద్యోగ వేటలో ఉన్న 2,507 మంది భారతీయులతో సహా సింగపూర్, జపాన్, ఆ్రస్టేలియాకు చెందిన 6,126 మంది పాలుపంచుకున్నారు.  

నైపుణ్యాల ఆధారంగానే.. 
అధునాతన సాంకేతికతలను స్వీకరించేందుకూ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని నివేదిక వివరించింది. ఆరి్టఫీíÙయల్‌ ఇంటెలిజెన్స్, సాంకేతికత కూడిన రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని 55 శాతం మంది ఆశాభావంతో ఉన్నారు. ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, కాన్‌ఫ్లిక్ట్‌ రిజొల్యూషన్, డేటా లిటరసీ, ఏఐ, మెషీన్‌ లెరి్నంగ్, కోడింగ్‌ వంటివి 2025లో కెరీర్‌ పురోగతికి ఉపయోగపడే నైపుణ్యాలుగా భావిస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ–ఆధారిత అర్హతల కంటే నైపుణ్యాల ఆధారిత నియామకాలు ఉంటాయని 59 శాతం మంది భారతీయ ఉద్యోగులు విశ్వసిస్తున్నారు.

 ఈ ధోరణి సాంకేతికత, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు తగ్గట్టుగా అనుకూలత, ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించగల అభ్యర్థులకు కంపెనీలు ఎక్కువగా విలువ ఇస్తున్నాయి. ప్రతిభావంతులకే గుర్తింపు, తదుపరి దశలకు వెళ్తారన్న భావన ఉద్యోగుల్లో ఉంది’ అని నివేదిక వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement