పోలీసుల అదుపులో ఒడిశా యువతులు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఒడిశా యువతులు

Jun 3 2023 8:10 AM | Updated on Jun 3 2023 8:29 AM

కారులో ప్రయాణిస్తున్న యువతులు  - Sakshi

కారులో ప్రయాణిస్తున్న యువతులు

భద్రాద్రి: పొట్టకూటి కూసం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్తూ మార్గమధ్యలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఒడివా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన 13 మంది యువతులు తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూట్‌లోని ఓ దుస్తుల కంపెనీలో పనిచేసేందుకు వెళ్తున్నారు.

యువతులు రెండు కార్లు (వాహనాల్లో) బయలు దేరారు. మార్గమధ్యలో ఓ కారు చెడిపోయింది. దీంతో ఒకేకారులో సర్దుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చండ్రుగొండలోని ఓ పెట్రోల్‌బంకులో కారు ఆపి సేదతీరుతున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ విజయలక్ష్మి సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అదుపులో తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

యువతుల వద్ద ఉన్న కంపెనీ గుర్తింపు కార్డులను పోలీసులు తనిఖీ చేయగా అవి ఓ ప్రముఖ దుస్తుల కంపెనీకి చెందినవిగా ఉన్నాయి. కాగా, ఈ అంశంపై డీఎస్పీ అబ్దుల్‌ రెహమాన్‌ను వివరణ కోరగా పోలీసులకు పట్టుపడిన యువతులను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం యువతులను పంపిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement