ఎండిన వేపచెట్ల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఎండిన వేపచెట్ల తొలగింపు

Jul 15 2026 1:10 AM | Updated on Jul 15 2026 1:10 AM

పెద్దమండ్యం : మండ్యం హరిజనవాడ పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఎండిన వేపచెట్లను ఎట్టకేలకు అధికారులు తొలగించారు. ఈ పాఠశాలలో 1 నుండి 5వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు విరామ సమయంలో అక్కడే ఆడుకుంటుంటారు. ఎండిన చెట్లతో పొంచి ఉన్న ముప్పుపై ‘అప్రమత్తత కరువు’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఎంఈవో మనోహర, ఉపాధ్యాయుడు నాగమునిరెడ్డిలు యుద్ధప్రాతిపదికన జేసీబీని రప్పించి ఆ ఎండిన వేపచెట్లను పూర్తిగా తొలగించారు. ప్రమాదం పొంచి ఉన్న చెట్లను తొలగించి తమ పిల్లలకు రక్షణ కల్పించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ‘సాక్షి’కి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

దరఖాస్తు గడువు పెంపు

మదనపల్లె సిటీ : జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. ఈనెల 17వతేదీ వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ఫైనల్‌ సబ్‌ మిషన్‌కు ఈనెల 20వతేదీ వరకు సమయం ఉందన్నారు. జిల్లాలోని అర్హుౖలైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎంఈఓలు, హెచ్‌ఎంలు ప్రోత్సహించాలన్నారు. ప్రతి మండలం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధ్యాయులు నేషనల్‌ టీచర్‌ అవార్డులకు దరఖాస్తు చేసేలా ఎంఈవోలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement