మహిళా క్రికెట్‌ పోటీల్లో అదరగొట్టిన ‘అనంతపురం’ | - | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెట్‌ పోటీల్లో అదరగొట్టిన ‘అనంతపురం’

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

వాల్మీకిపురం : మహిళా క్రికెట్‌ పోటీల్లో అనంతపురం జట్టు అదరగొట్టింది. స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడా మైదానంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న సౌత్‌జోన్‌ ఉమెన్స్‌ అండర్‌ 19 వన్‌డే అంతర్‌ జిల్లా క్రికెట్‌ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల క్రికెట్‌ టీంలు పాల్గొన్నాయి. టోర్నమెంట్‌ చాంపియన్స్‌గా అనంతపురం జట్టు, రన్నర్స్‌గా చిత్తూరు జట్టు నిలిచాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ ప్రణీత్‌, ఆంధ్రక్రికెట్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ విజయ్‌ చాంపియన్‌ జట్లకు ట్రోఫీలను అందించారు. ఈ కార్యక్రమంలో సీడీసీఏ ప్రెసిడెంట్‌ శ్రీనివాసమూర్తి, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌కుమార్‌, సెక్రటరీ సతీష్‌ యాదవ్‌, ఉమ్మడి చిత్తూరు జిల్లా కోచ్‌ సునీల్‌ కుమార్‌, నాగలక్ష్మి, సాయిప్రభాకర్‌, ధనలక్ష్మి, మాధవి, శేఖర్‌, మౌనిక, రెడ్డిరాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్‌ అండర్‌ 19 టోర్నమెంట్‌లో విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement