విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్న్నేతలు పీవీ సురేష్ , రాయపురెడ్డి అనిల్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, కార్మిక నేతలు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రమిచ్చారు.
అనంతరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పలువురు ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ..విద్య, వైద్యం, ప్రజా రవాణా వంటి కీలక రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అయితేనే పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జాన్వెస్లీ, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


