YSRCP BC Leaders Meet in CM Camp Office Tadepalli - Sakshi
Sakshi News home page

YSR Congress Party: డిసెంబర్‌ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం

Nov 26 2022 1:10 PM | Updated on Nov 26 2022 2:32 PM

YSRCP BC Leaders meet in CM Camp office Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బీసీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాలనాయుడు, వేణుగోపాలకృష్ణ, జయరాం, జోగి రమేష్‌, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, పార్థసారథి, ఎంపీ మోపిదేవి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు.

సమావేశం అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ.. డిసెంబర్‌ 8న విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 10వేల మందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. మాది బీసీల ప్రభుత్వమన్నారు. మూడున్నరేళ్లలో బీసీలకు ఎన్నో పథకాలు అందించామన్నారు. డిక్లరేషన్‌లోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని బీసీ నాయకులు పేర్కొన్నారు. 

చదవండి: (కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement