సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి మూడు రోజులపాటు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్ ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేయనున్నారు.


