వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన అప్డేట్స్..
దేవరపల్లి
- వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు
- జనం రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు
- వాహనాల్లో వచ్చిన రైతులను హైవే వద్దే ఆపేస్తున్న పోలీసులు
- ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్న పోలీసులు
- పోలీసులు తీరుపై రైతుల తీవ్ర ఆగ్రహం
- వైఎస్ జగన్కు కష్టాలు చెప్పుకోవడానికి వస్తున్న రైతులను అడ్డుకోవడంపై మండిపాటు

కాసేపట్లో వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన..
- కాసేపట్లో వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన
- దేవరపల్లిలో ఇంకా కనిపించని పోలీసులు
- హెలిప్యాడ్ దగ్గరకు భారీగా చేరుకుంటున్న జనం
- అయినా కనపడని పోలీసు బందోబస్తు
- ఒకే ఒక్క రోప్ పార్టీ తప్ప మరెవ్వరూ కనపడని పోలీసులు
- జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వైఎస్ జగన్
- కానీ ఆ మేరకు బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసు శాఖ
- పోలీసు అధికారుల వైఖరిపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
- టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసుల నిర్లక్ష్య వైఖరి అంటున్న వైఎస్సార్సీపీ

తాడేపల్లి..
- దేవరపల్లి బయలుదేరిన వైఎస్ జగన్
- కాసేపట్లో పొగాకు వేలం కేంద్రం సందర్శన
- రైతులు, రైతు ప్రతినిధులతో జగన్ ముఖాముఖి
👉వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.
పర్యటనలో భాగంగా అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు.

కాగా, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో దేవరపల్లి పొగాకు యార్డ్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. యార్డ్ లోపలికి రైతులను రానివ్వడం లేదని తాజాగా అన్నదాతులు చెబుతున్నారు. దీంతో, యార్డ్ వద్ద పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. అనంతరం, రైతులను తనిఖీలు చేసి యార్డ్ లోపలికి అనుమతించినట్టు సమాచారం.


