వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత | Tension Episode At Vempally Police Station YSR District | Sakshi
Sakshi News home page

వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

Jul 7 2025 10:03 PM | Updated on Jul 7 2025 10:14 PM

Tension Episode At Vempally Police Station YSR District

వైఎస్సార్‌ జిల్లా జిల్లాలోని వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.  చింతలమడుగు పల్లెకు చెందిన సయ్యద్‌ సుమయ(18) మిస్సింగ్‌కు సంబంధించి పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు స్థానిక ప్రజలు. ఆమె గొర్రెలు మేపుతుండగా ఐదు మంది యువకులు సుమయాను చుట్టుముట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

అయితే ఈ క్రమంలోనే వారిని తమకు అప్పగించాలని స్థానికులు పోలీస్‌ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఆమెను చంపేశారా.. తప్పిపోయిందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అడవి మొత్తం గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్ ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement