సాక్షి కార్యాలయాల వద్ద పచ్చ మూకల విధ్వంసం | TDP Goons Attack On Eluru Sakshi Media Office In Andhra Pradesh, Watch Video Inside | Sakshi
Sakshi News home page

సాక్షి కార్యాలయాల వద్ద పచ్చ మూకల విధ్వంసం

Jun 11 2025 5:57 AM | Updated on Jun 11 2025 9:12 AM

Tdp Goons Attack On Eluru Sakshi Media Offices: Andhra pradesh

టీడీపీ మూకలు నిప్పు పెట్టడంతో తగులబడుతున్న ఏలూరులోని సాక్షి కార్యాలయం ఆవరణలో ఉన్న ఫర్నిచర్‌

ఏలూరు ఆఫీస్‌ ఆవరణలో ఫర్నీచర్‌ తగులబెట్టి బీభత్సం

రాజానగరం కార్యాలయం వద్ద సాక్షి బోర్డు పీకేసి దౌర్జన్యం  

రాజానగరం/ఏలూరు/ఏలూరు టౌన్‌: సాక్షి కార్యాలయాల వద్ద కూటమి మూకల విధ్వంసకాండ కొనసాగుతోంది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంతోపాటు ఏలూరులోని ప్రాంతీయ కార్యాలయం వద్ద కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంపైకి రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన పార్టీ), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ), అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన ముష్క­రులు దాడికి తెగబడ్డారు.

ప్రధాన గేటు ముంగిట సాక్షి పత్రికలను వేసి దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి నేమ్‌ బోర్డును పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, సాక్షి కార్యాలయాలపై కూటమి నేతల దాడులను అరికట్టాలని కోరుతూ తూర్పు గోదావరి, కాకినాడ ఎస్పీలు నరసింహ కిషోర్, బిందుమాధవ్‌లకు మీడియా ప్రతినిధులు వినతిపత్రాలు అందించారు.

ఫర్నిచర్‌ తగులబెట్టి భీతావహ వాతావరణం  
ఏలూరు ఎన్‌ఆర్‌ పేటలోని ‘సాక్షి’ ప్రాంతీయ కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన 500 మందికిపైగా టీడీపీ గూండాలు భీతావహ వాతావరణం సృష్టించారు. కార్యాలయం వద్ద ఫరి్నచర్‌ను పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. భారీగా మంటలు చెలరేగటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తొలుత కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు ముష్క­రులు యతి్నంచారు. కార్యాలయం ఆవరణలో కింద ఉన్న ఫరి్నచర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు, కార్యకర్తలు ఏప్రిల్‌ 22న కూడా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

సాక్షి కార్యాలయాలపై దాడులు హేయం 
టీడీపీ ప్రభుత్వం సాక్షి మీడియా గ్రూప్‌ టార్గెట్‌గా చేస్తున్న పనులు అత్యంత హేయం. అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా ఆఫీసులపై దాడి చేసిన పచ్చమూకలు... మరో అడుగు ముందుకేసి, ఏలూరు సాక్షి కార్యాలయంపై పెట్రోల్‌ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసి ఫరి్నచర్‌కు నిప్పు పెట్టడం దుర్మార్గం. ఈ అనైతిక చర్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అక్రమ కేసుతో సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం దారుణం.   – కురసాల కన్నబాబు,వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి

పథకం ప్రకారమే దాడులు
సాక్షి కార్యాలయాలపై మూడు రోజులుగా పథకం ప్రకారం టీడీపీ ముష్క­రులు దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయం ఆవరణలోని ఫర్నిచర్‌కు నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే. హింసాత్మక చర్యలు భవిష్యత్‌లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్రమ కేసులో కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నా.      – బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో విపక్ష నేత

కూటమి అరాచకాలు పతాకస్థాయికి  
ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి.  ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం దారుణం. టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి ఈ అరాచకాలకు తెగబడుతున్నాయి. ఏలూరు సాక్షి ఆఫీసులోని ఫర్నిచర్‌ తగులబెట్టడం అత్యంత దారుణం.      – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement