సాక్షి, తిరుపతి: ఏపీ సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు (శుక్రవారం) మానుకొండూరు రైల్వేస్టేషన్ పరిధిలో సంపర్క్ క్రాంత్రి ట్రైన్ S1 కోచ్లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే రైలు నిలిపివేసి మరమ్మత్తులు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ట్రైన్ యాథావిధిగా గమ్యస్థానాలకు వెళ్లింది. ప్రయాణికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.


