సినర్జిన్‌ ప్రమాదంలో మూడు చేరిన మరణాల సంఖ్య.. | Synergy Industry Death Toll Rises To Three At Visakha, More Details About This Incident | Sakshi
Sakshi News home page

సినర్జిన్‌ ప్రమాదంలో మూడు చేరిన మరణాల సంఖ్య..

Aug 26 2024 11:20 AM | Updated on Aug 26 2024 1:31 PM

Synergy Industry Death Toll Rises To Three At Visakha

సాక్షి, అనకాపల్లి: పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సినర్జిన్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్‌ సూర్యనారాయణ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, సూర్యనారాయణ మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

కాగా, ఈనెల 22వ తేదీన సినర్జిన్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా ప్రస్తుతం మృతుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్‌ పూరి చికిత్స పొందుతూ ఈ నెల 23న, రొయా అంగిరియా 24న మృతి చెందారు. అదే రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా సూర్యనారాయణ మరణించారు.  

అయితే, ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు⁠ ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించకపోవడంతో ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాక్షి.. బాధితులకు అండగా నిలిచింది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన యాజమాన్యం సోమవారం సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు రూ.కోటి చెక్కును అందించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement