ప్రతిపక్షం ఇష్టానుసారంగా మాట్లాడుతోంది: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రతిపక్షం ఇష్టానుసారంగా ఏదిపడితే అది మాట్లాడుతోందని, సేవ చేసే చిత్తశుద్ధి ఉంటే బాధ్యతగా ముందుకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్ను ఆయన పరిశీలించారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించి మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా.. ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తోందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని చెప్పారు.
సంబంధిత వార్తలు