రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం: సజ్జల | Sajjala Ramakrishnareddy Comments On AP Government Employees | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం: సజ్జల

Feb 4 2022 3:39 PM | Updated on Feb 4 2022 3:56 PM

Sajjala Ramakrishnareddy Comments On AP Government Employees - Sakshi

రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సాక్షి, తాడేపల్లి: రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులు బలప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. బయటి శక్తుల ప్రమేయంతో ఉద్యోగులకు ఇబ్బందులొస్తాయన్నారు.

చదవండి: సీఎం జగన్‌​కు కృత‍జ్ఞతలు తెలిపిన ముద్రగడ

సంబంధం లేని ఇష్యూలు హైలెట్‌ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉద్యోగులు నియంత్రణ కోల్పోయి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధం. ఆందోళనలు, సమ్మెల వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ సమస్యలను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement