సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంత్యుత్సవం బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు.
పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు


