
తిరుపతి, సాక్షి: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు , దర్శనానికి 5 గంటల సమయం. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.
నిన్న(ఆదివారం) స్వామివారిని 84,797 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 29,497 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.98 కోట్లుగా లెక్క తేలింది.