సింహాద్రిలో విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్ధరణ

Restoration of power generation at Simhadri - Sakshi

పరవాడ (పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపంతో మంగళవారం ఉదయం నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తిని బుధవారం పునరుద్ధరించారు. వర్షం కారణంగా మంగళవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింహద్రి ఎన్టీపీసీలో నాలుగు యూనిట్లలో రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే.

నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. బుధవారం ఉదయానికల్లా 1, 3, 4 యూనిట్ల నుంచి పూర్తిస్థాయి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కాగా, మధ్యాహ్నం 12 గంటలకు రెండో యూనిట్‌ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోందని పీఆర్వో టి.మల్లయ్య వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top