గుడ్లవల్లేరులో ఉద్రిక్తత..వైస్సార్‌సీపీ మహిళా నేతల అడ్డగింత | Police Stopped Ysrcp Woman Leaders At Gudlavalleru College | Sakshi
Sakshi News home page

గుడ్లవల్లేరులో ఉద్రిక్తత..వైఎస్సార్‌సీపీ మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు

Aug 30 2024 8:12 PM | Updated on Aug 30 2024 8:51 PM

Police Stopped Ysrcp Woman Leaders At Gudlavalleru College

సాక్షి,కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీలోపలికి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నేతలను శుక్రవారం(ఆగస్టు30) సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,వైఎస్సార్‌సీపీ మహిళా నేతలను  పోలీసులు అడ్డుకున్నారు.

కాలేజీ వద్ద ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. బాధిత విద్యార్థులతో మాట్లాడటంతో పాటు వారి ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ నేతల బృందం కాలేజీవద్దకు వెళ్లింది.  కాలేజీ హాస్టల్‌లో రహస్య కెమెరాలతో అమ్మాయిల వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలపై విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement