సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఎక్కువ మంది యువత వైరస్ బారిన పడుతున్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31వతేదీ వరకూ 20,647 కేసులు నమోదు కాగా 19 నుంచి 40 ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నారు. 19 నుంచి 30 ఏళ్ల లోపు వారు 21 శాతం మంది ఉండటం గమనార్హం. బయట ఎక్కువగా తిరుగుతున్న వారిలో వీరే అధికం. సెకండ్ వేవ్లో వృద్ధులు జాగ్రత్తలు వహిస్తున్నట్లు తేలింది. ఈ దఫా పెద్ద వయసు వారిలో తక్కువ మందికి కరోనా సోకినట్లు తేలింది. రోజువారీ కేసులను బట్టి వృద్ధుల్లో 1.5 శాతం మంది కూడా లేరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మహిళల్లో తక్కువ..
గత మూడు నెలల్లో నమోదైన కోవిడ్ కేసుల్లో పురుషులే అత్యధికంగా 12 వేల మందికిపైగా ఉన్నారు. 19 నుంచి 30 ఏళ్ల వయసు మహిళల్లో 1,710 మంది బాధితులున్నారు. బాల బాలికల్లో పదేళ్ల లోపు వారు 647 మంది ఉన్నారు. చిన్నారుల్లో ఎక్కువగా సెకండరీ కాంటాక్ట్ ద్వారా అంటే తల్లిదండ్రులు, బంధువుల నుంచి సోకినట్లు వెల్లడైంది.
మాస్కులు.. దూరం.. సబ్బు
విధిలేని పరిస్థితుల్లోనే బయటకు రావాలని, ఒకవేళ వచ్చినా మాస్కు లేకుండా సంచరిస్తే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది జన సమర్థ ప్రాంతాలకు యథేచ్ఛగా వస్తున్నారు. వీరిలో చాలామంది మాస్కులు ధరించడం లేదు. దీనివల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం.. ఈ మూడు మార్గాలే కరోనా నియంత్రణకు కీలకమని స్పష్టం చేస్తున్నారు. జీవనశైలి జబ్బులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు దాటిన వారు వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఉండాలని, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
యువతపై కరోనా పంజా
Published Wed, Apr 14 2021 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
పార్థుని ఎదుటే ‘తమ్ముళ్ల’ ముష్టి యుద్ధం
ప్రత్యేక పరిశీలకుడితో జిల్లా ఎన్నికల అధికారి భేటీ
సినీ ఫక్కీలో నగదు అపహరణ
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం
No Headline
అనంతపురం డీఐజీ బదిలీ
రాప్తాడులో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
తమ్ముళ్లకు ఓటమి భయం
ముస్లింలే వారి టార్గెట్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement