సాక్షి, కాకినాడ: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. తను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానన్నారు. పంతం నానాజీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీచేయాలన్నారు. ఒకవేళ నానాజీపై తాను గనుక ఓడిపోతే రాజకీయల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తాను కూడా నానాజీ కంటే ఎక్కువగా మాట్లాడగలనని కానీ తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు.


