సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్ హర్భర్ సమీపంలో దారుణం జరిగింది. చంటి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కర్రతో తలపై బాది అనంతరం ఉరేసి చంపారు. అయితే చంటి అనే వ్యక్తి ఇదివరకే తనకు ప్రాణహాని ఉందని తన కుటుంబసభ్యులతో తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.


