బంగారు దుకాణాల బరి తెగింపు | Lockdown And COVID 19 Rules Breaking in Jewellery Shops Anantapur | Sakshi
Sakshi News home page

బంగారు దుకాణాల బరి తెగింపు

Aug 11 2020 6:43 AM | Updated on Aug 11 2020 6:43 AM

Lockdown And COVID 19 Rules Breaking in Jewellery Shops Anantapur - Sakshi

బంగారు దుకాణంపై కేసు నమోదు చేస్తున్న ఎంహెచ్‌ఓ

అనంతపురం సెంట్రల్‌: నగరంలో జాయ్‌అలుకస్, మలబార్‌గోల్డ్‌ జ్యువెలరీ నిర్వాహకులు కోవిడ్‌–19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా తెరవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్‌–19 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు నగర పాలక సంస్థ ప్రజారోగ్యం అధికారి డాక్టర్‌ రాజేష్‌ తనిఖీలో తేలింది. దీంతో సదరు నిర్వాహకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎంహెచ్‌ఓ తెలిపారు. భౌతికదూరం పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement