న్యాయవాదులకు ఓర్పు, నేర్పు అవసరం | Lawyers awareness conference concluded on Sunday | Sakshi
Sakshi News home page

న్యాయవాదులకు ఓర్పు, నేర్పు అవసరం

Jun 17 2024 4:06 AM | Updated on Jun 17 2024 4:06 AM

Lawyers awareness conference concluded on Sunday

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

తాడేపల్లిరూరల్‌: ఆధారాలను సేకరించడంలో న్యాయవాదులు ఓర్పు, నేర్పు కలిగి ఉండాలని సుప్రీం­కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సూచించారు. వడ్డేశ్వరంలోని కేఎల్‌ వర్సి­టీ­లో ఏపీ బార్‌ కౌన్సి­ల్‌ ఆధ్వ­ర్యాన మూడు రోజులుగా నిర్వహిస్తున్న న్యాయవాదుల అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు సదస్సుకు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత.. ఐపీసీని పోలి ఉందన్నారు. సైబర్‌ క్రైమ్, లింగ వివక్ష చట్టం, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలలోని పలు సెక్షన్ల గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఆస్తి బదిలీ చట్టం, ఆస్తి హక్కు, నిర్దిష్ట ఉపశమన చట్టం, రిజి­స్ట్రేషన్‌ చట్టం, మే«ధో సంపత్తి హక్కులు, ఎలక్ట్రానిక్‌ ఆధా­రాలు, రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో న్యాయవాది పాత్ర, డాక్యుమెంటేషన్‌ వంటి పలు అంశాల గురించి న్యాయవాదులకు వివరించారు. 

ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి, కేఎల్‌యూ వీసీ డాక్టర్‌ జి.పార్థ­సారథి­వర్మ, ప్రో వైస్‌ చాన్సలర్‌లు డాక్టర్‌ ఏవీఎస్‌ ప్రసాద్, డాక్టర్‌ ఎన్‌.వెంకటరామ్, డాక్టర్‌ కె.రాజశేఖరరావు, రిజి­స్ట్రార్‌ కె.సుబ్బారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement